News March 28, 2024
LS ఎన్నికల ముంగిట ED ఫైర్

లోక్సభ ఎన్నికల ముంగిట విపక్ష నేతలకు ED నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(AAP) కస్టడీలో, ఎమ్మెల్సీ కవిత(BRS) జైలులో ఉన్నారు. తాజాగా కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్(CPM)కు సైతం నోటీసులు అందాయి. వీరే కాదు.. మహువా మొయిత్రా(TMC), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రాజా(DMK), సోలంకి(SP), కీర్తికార్(శివసేన-ఉద్ధవ్), సుభాష్(RJD)లు నోటీసులు అందుకున్నారు.
Similar News
News April 19, 2026
ఛేజింగ్లో చేతులెత్తేస్తున్న ఛాంపియన్లు

ఐదుసార్లు IPL ఛాంపియన్లు అయిన MI, CSK ఛేజింగ్లో చేతులెత్తేస్తున్నాయి. 2024 నుంచి ఇప్పటివరకు ముంబై 19 మ్యాచుల్లో 12 ఓడిపోగా, చెన్నై 16 మ్యాచుల్లో 10 ఓడిపోయి ఛేజింగ్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన జట్లుగా నిలిచాయి. ఈ ఇరు జట్లు ఛేజింగ్ను మెరుగుపర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక CSK కెప్టెన్ రుతురాజ్ ఛేజింగ్ రికార్డ్ కూడా వీక్గా ఉంది. 2022 నుంచి 23 మ్యాచ్ల్లో రుతురాజ్ కేవలం 518 రన్స్ చేశారు.
News April 19, 2026
SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు: మంత్రి

AP: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 40% రాయితీతో పంపిణీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్ను ప్రభుత్వానికి అమ్మవచ్చని వివరించారు.
News April 19, 2026
ప్రభ్సిమ్రన్.. మ్యాచును మలుపు తిప్పేస్తాడు!

పంజాబ్ విజయాల్లో శ్రేయస్తో పాటు ఓపెనర్ ప్రభ్సిమ్రన్ పాత్ర ఎంతో ఉంది. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపు తిప్పేయడం ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 56 IPL మ్యాచుల్లో 1,516 రన్స్ చేశారు. 2023లో ఢిల్లీపై సెంచరీ చేశారు. స్ట్రైక్ రేట్ 154గా ఉంది. 2026 సీజన్లో 5 మ్యాచుల్లోనే 70 సగటుతో 211 రన్స్ చేశారు. తాను యువీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని ఇటీవల చెప్పారు.


