News March 28, 2024

LS ఎన్నికల ముంగిట ED ఫైర్

image

లోక్‌సభ ఎన్నికల ముంగిట విపక్ష నేతలకు ED నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(AAP) కస్టడీలో, ఎమ్మెల్సీ కవిత(BRS) జైలులో ఉన్నారు. తాజాగా కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్(CPM)కు సైతం నోటీసులు అందాయి. వీరే కాదు.. మహువా మొయిత్రా(TMC), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రాజా(DMK), సోలంకి(SP), కీర్తికార్(శివసేన-ఉద్ధవ్), సుభాష్(RJD)లు నోటీసులు అందుకున్నారు.

Similar News

News March 9, 2026

అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

image

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

News March 9, 2026

GREAT: 6 గంటలు శ్రమించి పులికి ఆపరేషన్ (PHOTOS)

image

పట్నా జూకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఢిల్లీ జూలోని ఏడాదిన్నర ఏళ్ల ‘దుర్గ’ అనే తెల్ల పులి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనికి ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ICAR) వైద్యులు అధునాతన ఆర్థోపెడిక్ పద్ధతులతో ఆపరేషన్ చేశారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ICAR దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

News March 9, 2026

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రయల్ కోర్ట్ తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇటీవల వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.