News June 20, 2024

కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టుకు ఈడీ?

image

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కాసేపటి క్రితం కేజ్రీవాల్‌కు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తూ వస్తోంది.

Similar News

News October 8, 2024

బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్

image

AP: పిఠాపురంలో <<14301232>>మైనర్<<>> బాలికపై జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News October 8, 2024

త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సమావేశానికి హాజరయ్యారు.

News October 8, 2024

తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

image

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.