News March 28, 2024

ఆప్‌ని లేకుండా చేయడమే ఈడీ ఉద్దేశం: కేజ్రీవాల్

image

ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయడమే ఈడీ ఉద్దేశంలా కనిపిస్తోందని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనల సందర్భంగా సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ‘ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది. అప్రూవర్‌గా మారి బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రా రెడ్డి బీజేపీకి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని వాదించారు. దీనిపై ASG రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Similar News

News December 5, 2025

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>SAIL<<>>)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. నేటితో అప్లై గడువు ముగియనుండగా.. DEC 15వరకు పొడిగించారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in

News December 5, 2025

TG న్యూస్ రౌండప్

image

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్‌ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News December 5, 2025

గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

image

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.