News February 23, 2025
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్ల బదిలీ

TG: రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పి.విశ్వప్రసాద్-క్రైమ్స్ అదనపు కమిషనర్ HYD, బి.నవీన్ కుమార్-CID ఎస్పీ HYD, గజారావు- ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సైబరాబాద్, డి.జోయెల్ డేవిస్-ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ HYD, సిరిశెట్టి సంకీర్త్ గవర్నర్ ADC, బి.రాంరెడ్డి- CID SP HYD, సీహెచ్ శ్రీధర్-ఇంటెలిజెన్స్ ఎస్పీ HYD, ఎస్.చైతన్య కుమార్-SB డీసీపీ HYD.
Similar News
News March 25, 2025
నేనెప్పుడు కేసీఆర్ను కించపరచలేదు: జూపల్లి

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News March 25, 2025
7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలు బ్లాక్: బండి

ప్రజలను తప్పుదోవ పట్టించడం, డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్న వారిని కట్టడి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ ఏడాది FEB వరకు 7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలను, 2.08L IMEIలను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.4,386 కోట్లను కాపాడినట్లు పార్లమెంటులో సమాధానమిచ్చారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు https://cybercrime.gov.in పోర్టల్ను ప్రారంభించామన్నారు.
News March 25, 2025
రేపు వైసీపీ ఇఫ్తార్ విందు

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.