News May 11, 2024
ఎన్నికల ఎఫెక్ట్.. పెరిగిన విమాన ఛార్జీలు!

ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈనెల 11 నుంచి 13 వరకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, విమాన టికెట్ ధరలు 20-30% పెరిగాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి వైజాగ్కి ₹4,500 ఉండే టికెట్ ధర ఈనెల 12వ తేదీకి ₹6,500కి చేరింది. హైదరాబాద్-కొచ్చి ధర ₹5వేల నుంచి ₹7వేలకు పెరిగింది. రద్దీని బట్టి ఛార్జీలుంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News April 17, 2026
హార్ముజ్ను ఇరాన్ ఇక ఆయుధంగా వాడదు: ట్రంప్

హార్ముజ్ జలసంధిని ఇకపై ఎప్పటికీ తెరిచే ఉంచేందుకు ఇరాన్ అంగీకరించిందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై దానిని ఆ దేశం ఆయుధంగా ప్రయోగించదన్నారు. తమ సహకారంతో ఇరాన్ హార్ముజ్లోని మైన్స్ను తొలగిస్తోందన్నారు. యుద్ధం వేళ సమన్వయం పాటిస్తూ సహకరించిన సౌదీ, యూఏఈ, ఖతర్లకు ధన్యవాదాలు తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అద్భుతమైన వ్యక్తులని పొగడ్తలతో ముంచెత్తారు.
News April 17, 2026
ఫ్రిజ్ను ఆఫ్ చేస్తున్నారా?

ఫ్రిజ్ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.
News April 17, 2026
BJP రాజకీయంతోనే బిల్లు వీగింది: KTR

TG: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. BRS సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా.. BJP రాజకీయంతోనే బిల్లు వీగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.


