News August 6, 2024
మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కసరత్తు

తెలంగాణలో ఖాళీ అవనున్న 3 MLC స్థానాల ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 29తో కరీంనగర్, మెదక్, NZB, ADB జిల్లాల పట్టభద్రుల MLC, ఇవే జిల్లాల ఉపాధ్యాయ MLC, నల్లగొండ, KMM, వరంగల్ జిల్లాల టీచర్స్ నియోజకవర్గ MLCల పదవీకాలం ముగియనుంది. SEP నుంచి ఓటరు జాబితా దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 30 తుది జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
Similar News
News December 11, 2025
క్యాబినెట్ భేటీకి ఆలస్యం.. మంత్రులపై CM ఆగ్రహం

AP: క్యాబినెట్ భేటీకి లేట్గా వచ్చిన రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాశ్ సహా మరో మంత్రిపై CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్యాబినెట్ లాంటి కీలక భేటీకి ఆలస్యం కావడం ఏమిటి? డిసిప్లిన్ లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ లోపంతో ఆలస్యం అయ్యామని మంత్రులు చెప్పగా మళ్లీ రిపీట్ కాకూడదని స్పష్టం చేశారు. కాగా కొందరు మంత్రులు గ్రౌండ్వర్క్ చేయడం లేదని CBN అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం.
News December 11, 2025
చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.
News December 11, 2025
మొదలైన కౌంటింగ్.. గెలుపెవరిది.. తెలుసుకోండి

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా వార్డు మెంబర్స్ అభ్యర్థుల ఓట్లు కట్టలు కట్టి లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటాయి. ఊర్లలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ ఎన్నికకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. Way2Newsలో మీ లొకేషన్పై క్లిక్ చేసి ఊరు, వార్డు వారీగా కౌంటింగ్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా పొందండి.


