News June 3, 2024
ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది: సీతారాం ఏచూరి
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News October 10, 2024
సూపర్ హీరోగా నందమూరి బాలకృష్ణ?
నందమూరి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినా సూపర్ పవర్స్ ఉన్న హీరో రోల్ మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. త్వరలోనే ఆ పాత్రను కూడా ఆయన పోషించే ఛాన్స్ కనిపిస్తోంది. రేపే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన తనయుడు మోక్షజ్ఞ ఇలాంటి కథతోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News October 10, 2024
పాక్ కెప్టెన్ ఇంట్లో తీవ్ర విషాదం
పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె హుటాహుటిన దుబాయ్ నుంచి కరాచీ బయల్దేరి వెళ్లారు. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్కు వైస్ కెప్టెన్ మునీబా అలీ సారథిగా వ్యవహరిస్తారు. కాగా మహిళల టీ20 వరల్డ్ కప్లో ఫాతిమా సారథ్యంలో పాక్ ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడింది.
News October 10, 2024
తూర్పుగోదావరిలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్
AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్హౌస్లో జరిగిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.