News May 12, 2024

ఏపీలో ఎన్నికలు.. ఈసీ కీలక హెచ్చరిక

image

AP:ఓటర్ల వేళ్లపై ఇతర సిరాల ద్వారా మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ‘ఇంటి వద్దే వేళ్లపై మార్కు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మాత్రమే చెరగని సిరా తయారుచేస్తుంది. ఇది EC వద్దే అందుబాటులో ఉంటుంది. ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు సమాచారం. ఎవరైనా ఇతర సిరాలు ఉపయోగిస్తే చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 8, 2025

ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

image

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.

News February 8, 2025

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?

image

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

News February 8, 2025

Round 6: ఢిల్లీలో 300 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్

image

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ వెనుకంజ వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కన్నా 300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

error: Content is protected !!