News March 28, 2024
ELECTIONS: వాట్సాప్లో ఇవి షేర్ చేస్తున్నారా?

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యే కంటెంట్పై అడ్మిన్లు, సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. జాతి, మత, కుల వ్యతిరేకమైన కంటెంట్, అసత్య ప్రచారాలు, ధ్రువీకరించని వార్తలు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి, హింసను ప్రేరేపించే కంటెంట్, పోర్నోగ్రఫీ కంటెంట్, ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Similar News
News July 11, 2025
ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <