News November 20, 2024
Elections: వీరి ఆస్తులు రూ.2వేలే!

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అజయ్ భోజ్రాజ్, విజయ్ మనోహర్, అల్తాఫ్ సయ్యద్ తమ ఆస్తులు కేవలం రూ.2,000 అని అఫిడవిట్లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పేద అభ్యర్థులుగా నిలిచారు. పరాగ్ షా(BJP) రూ.3,383 కోట్లతో రిచ్ కాండిడేట్గా ఉన్నారు. నిరక్షరాస్యులు 10, 5వ తరగతి 85, 8th 214, టెన్త్ 313, ఇంటర్ చదివిన వారు 422 మంది ఉన్నారు. PS: HT
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.