News August 10, 2024

ఉచిత బస్సు ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన!

image

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశముందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. RTCలో 7వేల మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.

Similar News

News April 3, 2026

ఇంట్లోకి చొరబడి అత్యాచారం.. ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్..!

image

AP: పల్నాడు (D) మాచర్లలో గురువారం ప్రభుత్వ ఉద్యోగిని(32)పై జరిగిన అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లూచేతులు కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు HIV ఉందని బాధితురాలు చెప్పగా.. ఆమెను తీవ్రంగా కొట్టి, ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్ చొప్పించినట్లు సమాచారం. స్థానికులు వెళ్లి చూడగా ఆమె వివస్త్రగా స్పృహ కోల్పోయి పడి ఉంది.

News April 3, 2026

ఇంట్లో కుండలోని నీటిని తాగుతున్నారా?

image

వేసవి తాపాన్ని తీర్చే మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ శుభ్రత పాటించకపోతే అదే అనారోగ్యానికి దారితీయవచ్చు. మట్టి కుండలో నీరు సురక్షితంగా ఉండేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ‘కొత్త కుండను వాడే ముందు రోజంతా నీటిలో నానబెట్టాలి. రోజూ వేడి నీటితో కడగడం వల్ల బాక్టీరియా చేరదు. కుండను కడిగేందుకు సబ్బు వాడకండి. ఉప్పు లేదా బేకింగ్ సోడాతో మాత్రమే రుద్దడం మేలు’ అని సూచిస్తున్నారు.

News April 3, 2026

టీనేజర్ల ఫిజికల్ రిలేషన్.. కిడ్నాప్ కేసులో బాలుడికి ఊరట

image

15 ఏళ్ల బాలికతో ఫిజికల్ రిలేషన్ కారణంగా కిడ్నాప్ కేసు ఎదుర్కొంటున్న బాలుడికి ఉత్తరాఖండ్ హైకోర్టు ఉపశమనం కలిగించింది. అతనిపై జువెనైల్ జస్టిస్ బోర్డ్‌లో జరగాల్సిన విచారణను నిలిపివేసింది. తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాలుడిపై తండ్రి కేసు పెట్టారు. అయితే తానే అతడిని ఇంటికి ఆహ్వానించానని, పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగించామని బాలిక కోర్టుకు చెప్పింది. దీంతో బాలుడికి కోర్టు కేసు నుంచి ఊరటనిచ్చింది.