News March 30, 2024
కాంగ్రెస్, వామపక్షాల సీట్ల సర్దుబాటుపై ఎల్లుండి నిర్ణయం
AP: రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏప్రిల్ 1న సమావేశం జరగనుంది. తాము చెరో రెండు లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని CPM, CPI రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ప్రతిపాదించారు. దీనిపై షర్మిల కూడా తన అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. ఎల్లుండి తుది నిర్ణయం తీసుకుని పోటీ చేసే సీట్లను ఆయా పార్టీలు ప్రకటించనున్నాయి.
Similar News
News October 5, 2024
దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే
FY2024-25లో GSDP, GDP అంచనాల ప్రకారం ₹42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్గా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు(₹31.55L cr), కర్ణాటక(₹28.09L cr), గుజరాత్(₹27.9L cr), UP(₹24.99L cr), బెంగాల్(₹18.8L cr), రాజస్థాన్(₹17.8L cr), TG(₹16.5L cr), AP(₹15.89L cr), MP(₹15.22L cr) ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్గా, బాలీవుడ్కు కేంద్రంగా ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా MH టాప్లో ఉంది.
News October 5, 2024
బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు
AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
News October 5, 2024
నటి నాలుగో పెళ్లి వార్తలు.. అవన్నీ సినిమా స్టంట్స్
తమిళ నటి వనిత విజయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్ను <<14242143>>వివాహం<<>> చేసుకుంటాననే అర్థంలో కొన్ని రోజుల కిందట ఫొటో షేర్ చేసింది. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.