News March 30, 2024

కాంగ్రెస్, వామపక్షాల సీట్ల సర్దుబాటుపై ఎల్లుండి నిర్ణయం

image

AP: రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏప్రిల్ 1న సమావేశం జరగనుంది. తాము చెరో రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని CPM, CPI రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ప్రతిపాదించారు. దీనిపై షర్మిల కూడా తన అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. ఎల్లుండి తుది నిర్ణయం తీసుకుని పోటీ చేసే సీట్లను ఆయా పార్టీలు ప్రకటించనున్నాయి.

Similar News

News February 8, 2026

గందరగోళంలో ఉన్నారా? ఈ ప్రాచీన ట్రిక్ ట్రై చేయండి!

image

ఇతరుల సమస్యలకు గొప్ప సలహాలు ఇచ్చే మనం.. మన విషయంలో మాత్రం తడబడతాం. దీన్నే ‘సోలమన్ పారడాక్స్’ అంటారు. దీనికి చెక్ పెట్టేదే ‘ఇల్లీయిజం’. అంటే మీ గురించి మీరు ‘నేను’ అనకుండా మీ పేరుతో మాట్లాడుకోవడం. Ex ‘నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’ అని కాకుండా ‘రాజు (మీ పేరు) ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి?’ అని ఆలోచించడం. ఇలా చేస్తే ఎమోషన్స్ పక్కకు జరిగి తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

News February 8, 2026

భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

image

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్‌లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

News February 8, 2026

కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రిప్లై!

image

AP: తిరుపతిలోని MBUలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతల <<19041650>>కిడ్నాప్ కేసు<<>> కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు (A-3) 5న నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు రావాలన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వర్సిటీ PRO సతీశ్ (A-1) సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. A-2గా ఉన్న మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదు.