News January 10, 2025
ఉద్యోగులమా? లేక కాడెద్దులమా?

ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నా యజమానుల తీరు మారట్లేదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని వారు పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. తాజాగా L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాడెద్దుల్లా పనిచేయాలన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఉద్యోగం చేస్తున్నా గుర్తింపులేదని వాపోతున్నారు.
Similar News
News January 27, 2026
నిద్ర నాణ్యత పెంచుకోండిలా!

పగలంతా హుషారుగా పనిచేయాలంటే రాత్రి నాణ్యమైన నిద్ర అవసరం. అందుకు రోజూ ఒకే టైమ్కు నిద్ర పోవడం, లేవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ దీన్ని పాటించాలంటున్నారు. పడుకునే చోట లైట్లు పడకుండా, శబ్దాలు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. రాత్రి వేళ లైట్ ఫుడ్ తీసుకోవడంతో పాటు నిద్రకు 30-60ని. ముందు స్క్రీన్ చూడటం ఆపాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే విషయాల గురించి ఆలోచించొద్దంటున్నారు.
News January 27, 2026
పహల్గాం హీరో అదిల్కు అవార్డు

గత ఏప్రిల్లో ఉగ్రమూకలు పహల్గాంలో జరిపిన దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన అదిల్ హుస్సేన్ షాకు JK ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కునేందుకు అదిల్ యత్నించారు. హార్స్ రైడర్ అయిన ఆయన ప్రాణాలను పణంగా పెట్టి టూరిస్టులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం ₹లక్ష నగదుతో పాటు అవార్డును వారి ఫ్యామిలీకి అందజేసింది.
News January 26, 2026
నేషనల్ అవార్డ్ విన్నర్తో మోహన్లాల్ కొత్త సినిమా

రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ లాల్ తన 367వ సినిమాను ప్రకటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీ గోకులం మూవీస్’ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ‘దృశ్యం 3’తో రాబోతున్న మోహన్ లాల్.. మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ గంగా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని సమాచారం.


