News October 11, 2024
ఎన్కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

ఈ నెల 5న ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 31, 2026
మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 31, 2026
స్పటిక మాలను ఎందుకు ధరించాలి?

స్పటిక మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఇది శుక్ర గ్రహాన్ని బలపరిచి సంపద, కీర్తి, ఆకర్షణను ప్రసాదిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి మనస్సును చల్లబరుస్తుంది. మనస్సును నిగ్రహించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తూ ధరిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.


