News October 11, 2024

ఎన్‌కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

image

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

ఉమ్మడి KNRలోని ఫేమస్ ‘అయ్యప్ప టెంపుల్స్’..!

image

మెట్‌పల్లి ధర్మశాస్తాలయం, జమ్మికుంట, కేశవపట్నం, గొల్లపల్లి, హుజూరాబాద్, కోరుట్ల <<18317644>>అయ్యప్పగుట్ట<<>>, మల్యాల, రాయికల్, ఇల్లంతకుంట, ధర్మారం, వేములవాడ, ధర్మపురి, ముస్తాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, మంథని, చొప్పదండి, సుల్తానాబాద్, ఎల్లారెడ్డిపేట, కాల్వశ్రీరాంపూర్, గోదావరిఖని, హుస్నాబాద్, KNRలోని భగత్‌‌‌నగర్, జ్యోతినగర్, మధురానగర్, మహాత్మానగర్, కశ్మీర్‌‌గడ్డ, గోదాంగడ్డ, గంగాధర, తీగలగుట్టపల్లి, తిమ్మాపూర్

News November 19, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.