News March 10, 2025
పుష్ప-2 లాభాలను దానికోసం వాడేలా చూడండి: హైకోర్టులో పిల్

TG: పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను చిన్న బడ్జెట్ సినిమాల రాయితీకి ఉపయోగించాలని నరసింహారావు అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లాభాలను కళాకారుల సంక్షేమానికి వాడాలని అందులో కోరారు. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప-2 అన్ని భాషల్లో కలిసి రూ.1800 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.
Similar News
News March 10, 2025
అబ్బాయిలకూ పీరియడ్స్ వంటి సమస్య!

అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో అబ్బాయిలూ ప్రతి నెలా IMS(ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంటుంది. నెలలో IMS సమయంలో వీరు ఎవరితో మాట్లాడరు. చిరాకు పడటం, రీజన్ లేకుండా కోప్పడతారు. దేనిపైనా ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి సమయంలో వారితో ఆర్గ్యుమెంట్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీకు ఇలానే అనిపిస్తుందా? COMMENT
News March 10, 2025
జడేజా ‘పుష్ప-2’ సెలబ్రేషన్

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్ను టీమ్ ఇండియా ఆల్రౌండర్ జడేజా రిపీట్ చేశారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం బ్యాట్తో వీపుపై తన పేరును చూపించిన ఆయన, అదే ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పక్కన అల్లు అర్జున్ ఫొటో జత చేసి ‘జాతీయ ఆటగాడు అనుకుంటివా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
News March 10, 2025
నటుడు పోసానికి బెయిల్ మంజూరు

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. నరసరావుపేట జిల్లా కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇద్దరు జామీన్, రూ.10వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పోసానిని ఆదేశించింది. చంద్రబాబు, పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదుతో గతేడాది నవంబర్లో నరసరావుపేట 2టౌన్ పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది. అయితే మిగతా కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన బయటకొచ్చే అవకాశం లేదు.