News March 17, 2024
IPL సీజన్ మొత్తం భారత్లోనే: జైషా

ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం భారత్లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పష్టం చేశారు. త్వరలోనే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఐపీఎల్ నిర్వహణపై వచ్చే వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. కాగా ఏప్రిల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్ విదేశాల్లో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. రెండో దశ షెడ్యూల్ మొత్తం UAEలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.
Similar News
News January 14, 2026
ఇరాన్ ఘర్షణలు రక్తసిక్తం.. 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు జరుపుతున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 2,571కి చేరినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తెలిపింది. వీరిలో 147 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. మరో 18,100 మంది అరెస్టైనట్లు పేర్కొంది. ఉద్రిక్తతలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
News January 14, 2026
ఆర్థిక సంఘం నిధులు వచ్చేస్తున్నాయ్!

TG: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి నిలిచిపోయిన గ్రామపంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడగా జీపీలకు త్వరలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. రాష్ట్రానికి రూ.2,500Cr పెండింగ్ ఉండగా ఈ నెలాఖరు నాటికి రూ.1000Cr, వచ్చేనెల రూ.1500Cr కేంద్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ప్రతి జీపీకి ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్తో నిధులను వినియోగిస్తారు.
News January 14, 2026
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్లో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


