News April 18, 2024

పర్యావరణ మార్పు.. 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఖర్చు?

image

పర్యావరణ మార్పుల ప్రభావంతో 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఆర్థిక భారం పడనుందని జర్మనీకి చెందిన పాట్స్‌డ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ‘ఉత్పాదకత క్షీణించడం సహా వ్యవసాయం, మౌలికవసతులు, ఆరోగ్య రంగాలు దెబ్బతింటాయి. 2050కి ప్రపంచ GDP 17% నష్టపోతుంది. దీనితో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఖర్చు ($6 ట్రిలియన్లు) తక్కువ. సత్వర చర్యలు చేపడితే నష్టాన్ని నివారించవచ్చు’ అని సూచించింది.

Similar News

News September 17, 2025

AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<> AICTE<<>> , కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.

News September 17, 2025

JAM-2026కు దరఖాస్తు చేశారా?

image

<>JAM<<>>-2026కు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 12 ఆఖరు తేదీ. ఐఐటీల్లో బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ విభాగంలో పీజీలో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2000(రెండు పేపర్లకు రూ.2700), మహిళలు, SC, ST, దివ్యాంగులు రూ.1000 (రెండు పేపర్లకు రూ.1,350) చెల్లించాలి.

News September 17, 2025

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

image

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <>మహారాష్ట్ర<<>> 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, బీఈ, MSc, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1180కాగా, SC, ST, దివ్యాంగులు రూ.118 చెల్లించాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.