News April 18, 2024
పర్యావరణ మార్పు.. 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఖర్చు?

పర్యావరణ మార్పుల ప్రభావంతో 2050 నాటికి ఏటా $38 ట్రిలియన్ల ఆర్థిక భారం పడనుందని జర్మనీకి చెందిన పాట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ‘ఉత్పాదకత క్షీణించడం సహా వ్యవసాయం, మౌలికవసతులు, ఆరోగ్య రంగాలు దెబ్బతింటాయి. 2050కి ప్రపంచ GDP 17% నష్టపోతుంది. దీనితో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఖర్చు ($6 ట్రిలియన్లు) తక్కువ. సత్వర చర్యలు చేపడితే నష్టాన్ని నివారించవచ్చు’ అని సూచించింది.
Similar News
News November 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 24, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 24, 2025
సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.


