News October 31, 2024
నీతి, నిజాయితీగా పనిచేస్తా: టీటీడీ ఛైర్మన్

AP: గత ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు సృష్టించిందని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. తాను నీతి, నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు. ‘గతంలో రెగ్యులర్గా తిరుమల వెళ్లేవాడిని. కానీ గత ఐదేళ్లుగా ఒక్కసారి కూడా వెళ్లలేదు. తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ దెబ్బతీయడంతోనే నేను కొండకు వెళ్లలేదు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన ఉంది. చంద్రబాబు సలహాలు, సూచనలతో ముందుకెళ్తా’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
మాజీ మంత్రి కన్నుమూత

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు(1985, 89, 94, 99) టీడీపీ తరఫున పోటీ చేసి MLAగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
News January 12, 2026
VHT: పడిక్కల్ సరికొత్త చరిత్ర

కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ హజారే ట్రోఫీలో రెండు సార్లు 700కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా నిలిచారు. 2021లో 737 రన్స్ చేయగా ప్రస్తుత సీజన్లో 721 రన్స్తో కొనసాగుతున్నారు. ఈ సీజన్లో నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఓవరాల్గా ఈ జాబితాలో తమిళనాడు ప్లేయర్ జగదీశన్(830) ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నారు.
News January 12, 2026
అగ్నివీర్ వాయు దరఖాస్తులు షురూ

ఎయిర్ఫోర్స్లో అగ్నివీర్ వాయు నియామకాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా నాలుగేళ్లపాటు ఎయిర్ఫోర్స్లో సేవలందించేందుకు యువతకు అవకాశం దక్కనుంది. ఫిబ్రవరి 1వ తేదీ 11PM వరకు అప్లై చేసుకునేందుకు గడువుంది. 2006 జనవరి 1-2009 జులై 1 మధ్య పుట్టిన, ఇంటర్/12వ తరగతిలో 50% మార్కులు సాధించిన అవివాహితులు అర్హులు. మరిన్ని వివరాలకు iafrecruitment.edcil.co.in.లో సంప్రదించవచ్చు.


