News September 6, 2024
EV సంస్థలకు సబ్సిడీ అవసరం లేదు: గడ్కరీ

వినియోగదారులు ఇప్పుడు సొంతంగా EV లేదా CNG వాహనాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో EV తయారీదారులకు ఇక సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీజిట్, పెట్రోల్ వాహనాల కంటే ఈవీలపై జీఎస్టీ తక్కువన్నారు. రాయితీ అడగడం ఇక ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలపై 28%, EVలపై 5% GST ఉందన్నారు.
Similar News
News December 13, 2025
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

<<18552173>>కోల్కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.
News December 13, 2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


