News October 19, 2024
అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదు: మంత్రి కోమటిరెడ్డి

TG: పోరాటాలకు మారు పేరు నల్గొండ జిల్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా పాత్ర కీలకమని చెప్పారు. జిల్లా ప్రజలది దొరలు చెప్తే వినే రక్తం కాదన్నారు. బీఆర్ఎస్లా కాకుండా తాము చేసేదే చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం పర్యటనలు చేస్తున్నారన్నారు.
Similar News
News October 16, 2025
నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే: అమిత్షా

ఛత్తీస్గఢ్లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. ‘ఛత్తీస్గఢ్లోని అభూజ్మఢ్, నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి. 2024 JAN నుంచి 2,100 మంది నక్సలైట్లు సరెండరయ్యారు. 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 MAR 31లోపు నక్సలిజం అంతరిస్తుందనడానికి ఈ నంబర్లు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
News October 16, 2025
50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించరాదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లుండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50%లోనే సీట్లు కేటాయించాలి. ప్రస్తుతమున్న12769 పంచాయతీల్లో 6384, MPTC 5745లో 2872, MPP 566లో 283, ZPP 32లో 16 రిజర్వేషన్ల కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లలోనే SC, ST, BCలకు సీట్లు రిజర్వు చేయాలి. దీనికి మించి ఉండాలంటే పార్టీ పరంగా ఇవ్వాలి.
News October 16, 2025
రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: మోదీ

AP: డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కాదని, ఇప్పుడు ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా ఉందని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని కర్నూలు సభలో పేర్కొన్నారు.