News November 18, 2024

BJP రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నా: అర్వింద్

image

TG: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని పాతబస్తీ నుంచే మొదలుపెట్టాలని, కాంగ్రెస్ బుల్డోజర్లకు అక్కడికి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ KTRది మేకపోతు గాంభీర్యమని, ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమా అని నిలదీశారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం పనే అని ఆరోపించారు.

Similar News

News November 11, 2025

వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it

News November 11, 2025

కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే..

image

కనురెప్పలు ఒత్తుగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది. దీనికోసం కొన్ని సహజ చిట్కాలు..* రాత్రి పడుకొనే ముందు ఒక చుక్క ఆముదాన్ని కనురెప్పలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. * గ్రీన్‌టీలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కనురెప్పలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. గ్రీన్‌టీలో దూది ఉండను ముంచి కనురెప్పలపై అద్దాలి. ఇలా వారానికోసారి చెయ్యాలి. అయితే కనురెప్పలకు ఏవి రాసినా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కంట్లోకి వెళ్లి ఇబ్బంది పెడతాయి.

News November 11, 2025

ఉగ్రవాదంపై పోరాటానికి ఇండియాకు మా మద్దతు: ఇజ్రాయెల్

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ విచారం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. ఈ ఘటనపై NIA దర్యాప్తు చేయనుంది.