News September 25, 2024
ధోనీకి కూడా కోపమొస్తుంది: మోహిత్

కెప్టెన్ కూల్గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కోపమొస్తుందని CSK మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. ‘మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోనీకి కోపమొచ్చింది. బేవకూఫ్ తూ నహీ హై, బేవకూఫ్ మై హు అని తిట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో గుర్తుచేసుకున్నారు. ఆయనలోని ఈ కోణాన్ని కొద్ది మంది మాత్రమే చూశారన్నారు. దీపక్ చాహర్ కూడా ధోనీ చేతిలో తిట్లు తిన్నవారేనని చెప్పారు. అయితే ఇది గేమ్ వరకేనని సపోర్ట్ చేశారు.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.