News January 27, 2025
కాంబ్లీకి విడాకులు ఇవ్వాలనుకున్నా.. కానీ: ఆండ్రియా

మాజీ క్రికెటర్ <<15042382>>వినోద్ కాంబ్లీతో<<>> వివాహ బంధంపై రెండో భార్య ఆండ్రియా హెవిట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాగుడుకు బానిసైన ఆయనకు 2023లో విడాకులు ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు. అయితే కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పారు. ‘నేను వదిలేస్తే కాంబ్లీ నిస్సహాయ స్థితిలో ఉంటారు. అది నన్ను బాధిస్తుంది. అందుకే డివోర్స్ నిర్ణయం వెనక్కి తీసుకున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
లగ్జరీ కంటే సింప్లిసిటినే నాకు ముఖ్యం: రకుల్

తనకు లగ్జరీ కంటే సింప్లిసిటీనే ముఖ్యమని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. అందుకే తన పెళ్లిని చాలా సింపుల్గా చేసుకున్నట్లు తెలిపారు. ‘విరాట్ కోహ్లీ-అనుష్కలాగే మేం చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నాం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యాం. మా వివాహానికి నో ఫోన్ పాలసీ పాటించాం. ఒక్క అతిథి కూడా ఈవెంట్లో ఫోన్తో కనిపించలేదు. పెళ్లి జరిగిన 3 రోజులు చాలా ఎంజాయ్ చేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News February 19, 2025
మిర్చి రైతులపై జగన్వి పచ్చి అబద్దాలు: అచ్చెన్నాయుడు

AP: గుంటూరు మిర్చి యార్డులో మాజీ CM జగన్ పచ్చి అబద్దాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆయనను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘జగన్ తన పాలనలో రైతుల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఆయన హయాంలో రైతుల నుంచి ఒక్క గింజా కొనలేదు. డ్రిప్పులు అందించలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో ఒక్క పైసా ఇవ్వలేదు. మేం వచ్చి 6 నెలలు కాకముందే గగ్గోలు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.
News February 19, 2025
PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఇక్కడ <