News May 20, 2024
సీఎం ఆదేశించినా అమలు కావడం లేదు

TG:తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవ్వడంలేదు. తడిసిన ధాన్యం కొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి, మొలకలు వస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. CM ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
Similar News
News November 15, 2025
IIRSలో 11 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (<
News November 15, 2025
ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

TG: జూబ్లీహిల్స్లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఏ ఎన్నికలైనా బిహార్ లాంటి ఫలితాలే NDAకు వస్తాయి: బీజేపీ ఎంపీ పురందీశ్వరి
* లిక్కర్ కేసులో అరెస్టయిన అనిల్ చోఖ్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.
* సింగపూర్-విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి.
* పరకామణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్లో అతని బైక్ను పోలీసులు గుర్తించారు.


