News February 24, 2025
ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదు: రేవంత్

TG: కేసీఆర్ ఇక రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ఫామ్హౌస్లో కూర్చుని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ MLC ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు ఏమీ చేయని BRS ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్లకు ఏం చేశారు? టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఎందుకు చేపట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.
News November 11, 2025
మరో భారీ ఎన్కౌంటర్

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కీలక మావోయిస్టును బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
News November 11, 2025
షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్నెస్పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్నెస్పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.


