News February 24, 2025

ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదు: రేవంత్

image

TG: కేసీఆర్ ఇక రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ MLC ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు ఏమీ చేయని BRS ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్లకు ఏం చేశారు? టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఎందుకు చేపట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News February 24, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: NZ టార్గెట్ ఎంతంటే?

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 236/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శాంటో (77), జాకిర్ అలీ (45) రాణించారు. NZ బౌలర్లలో బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టగా, రూర్కీ 2, హెన్రీ, జెమీసన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే బంగ్లాదేశ్‌తో పాటు పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.

News February 24, 2025

విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

image

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం

News February 24, 2025

AP మిర్చికి కేంద్రం మద్దతు ధర

image

AP: మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ధర లేదంటూ ఏపీలో రైతులు ఆందోళన చేయగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేంద్రం మద్దతు ధరపై ఈ ప్రకటన చేసింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.

error: Content is protected !!