News September 20, 2024
కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై KCR పేరుంటుంది: హరీశ్రావు

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.
Similar News
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <
News November 22, 2025
అద్దం పగిలితే అపశకునమా?

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.


