News January 31, 2025
పెద్దిరెడ్డి భూకబ్జాలు అందరికీ తెలుసు: అనగాని

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జాల గురించి అందరికీ తెలిసిందే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన పలు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని చెప్పారు. మంగళంపేట అటవీభూములు దేనికి వాడుతున్నారో తెలియడం లేదన్నారు. గెస్ట్హౌస్కా? ఎర్రచందనం అక్రమ రవాణాకా? అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. మంగళంపేట అటవీ భూములపై రెండు వారాల్లో నివేదిక వస్తుందని తిరుపతి పర్యటనలో అనగాని తెలియజేశారు.
Similar News
News October 27, 2025
నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>
News October 27, 2025
శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 4 ట్రెయినీ డాక్ పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఎస్సీ నాటికల్ సైన్స్, సెకండ్ మేట్(FG)/డ్రెడ్జ్ మేట్ గ్రేడ్ 1 అర్హతగల అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. రాతపరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://smp.smportkolkata.in/
News October 27, 2025
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో రెండ్రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్న సమయంలో క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ తీవ్రంగా <<18098991>>గాయపడిన<<>> విషయం తెలిసిందే. వెంటనే మైదానాన్ని వీడగా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రిబ్స్లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని క్రీడా వర్గాలు తెలిపాయి.


