News January 31, 2025
పెద్దిరెడ్డి భూకబ్జాలు అందరికీ తెలుసు: అనగాని

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జాల గురించి అందరికీ తెలిసిందే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన పలు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని చెప్పారు. మంగళంపేట అటవీభూములు దేనికి వాడుతున్నారో తెలియడం లేదన్నారు. గెస్ట్హౌస్కా? ఎర్రచందనం అక్రమ రవాణాకా? అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. మంగళంపేట అటవీ భూములపై రెండు వారాల్లో నివేదిక వస్తుందని తిరుపతి పర్యటనలో అనగాని తెలియజేశారు.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.
News November 17, 2025
తెనాలి: విషాద ఘటనలు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి నాజరుపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పవన్ తేజ (24) ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో కొల్లిపర మండలం జముడుబాడుపాలెంకి చెందిన విద్యార్థిని లావణ్య (20) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. ఈ రెండు ఘటనలపై వన్టౌన్, కొల్లిపర పోలీసులు కేసులు నమోదు చేశారు.
News November 17, 2025
ఒకేసారి రెండు సీక్వెల్స్లో తేజా సజ్జ!

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.


