News January 31, 2025
పెద్దిరెడ్డి భూకబ్జాలు అందరికీ తెలుసు: అనగాని

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జాల గురించి అందరికీ తెలిసిందే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన పలు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని చెప్పారు. మంగళంపేట అటవీభూములు దేనికి వాడుతున్నారో తెలియడం లేదన్నారు. గెస్ట్హౌస్కా? ఎర్రచందనం అక్రమ రవాణాకా? అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. మంగళంపేట అటవీ భూములపై రెండు వారాల్లో నివేదిక వస్తుందని తిరుపతి పర్యటనలో అనగాని తెలియజేశారు.
Similar News
News February 14, 2025
రాహుల్ కులమేంటో చెప్పండి: రఘునందన్

TG: ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలకు<<>> BJP MP రఘునందన్ రావు కౌంటరిచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం OC నుంచి BCకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదన్నారు. మోదీ క్యాబినెట్లో 19 మంది BCలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు.
News February 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు షాక్

AUSతో జరిగిన రెండు వన్డేల సిరీస్ను శ్రీలంక 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో 174 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. అంతకుముందు PAKతో జరిగిన ODI సిరీస్నూ ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో వరుసగా 4 మ్యాచ్లు ఓడినట్లయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఫలితాలు ఆ జట్టుకు ఎదురుదెబ్బే. కీలక ఆటగాళ్లు కమిన్స్, హేజిల్ వుడ్, మార్ష్, స్టార్క్ కూడా CTకి దూరమైన విషయం తెలిసిందే.
News February 14, 2025
KCRకు తెలంగాణలో జీవించే హక్కు లేదు: CM

TG: మాజీ CM KCR లాంటి వాళ్లు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయనే కులగణనలో పాల్గొనలేదని CM రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని, వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు. KTR, హరీశ్ గ్యాంబ్లర్లు అని విమర్శించారు.