News November 26, 2024
ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరి ఊపిరితిత్తులు నాశనం: పరిశోధకులు

ఢిల్లీలో కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పౌరుల ఊపిరితిత్తులు కచ్చితంగా ఎంతోకొంతమేర నాశనం అయి ఉంటాయని అశోక యూనివర్సిటీ డీన్, పరిశోధకుడు అనురాగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ స్థాయి కాలుష్యం వలన ఆరోగ్యవంతుల లంగ్స్ కూడా ఇప్పటికే నాశనమవడం ప్రారంభమై ఉంటుంది. ఆల్రెడీ ఆస్తమా, ఇన్ఫెక్షన్లున్నవారి సమస్యలైతే వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ కాలుష్యం ఎవర్నీ వదిలిపెట్టదు’ అని హెచ్చరించారు.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.