News June 13, 2024
జెన్కో ఏఈ పోస్టుల భర్తీకి జులై 14న పరీక్ష

తెలంగాణ జెన్కోలో ఏఈ పోస్టుల భర్తీకి వచ్చే నెల 14న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సీఎండీ రిజ్వీ తెలిపారు. జులై 3 నుంచి హాల్టికెట్లను సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 339 పోస్టులకు గత ఏడాది అక్టోబర్ 4న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 31న రాత పరీక్ష జరగాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడింది.
Similar News
News March 21, 2025
BREAKING: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ కన్నడ దర్శకుడు AT రఘు(76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీశ్తో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. 55 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన తొలి చిత్రం ‘న్యాయ నీతి ధర్మ’.
News March 21, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 58,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.
News March 21, 2025
అలా చేస్తే టీమ్ ఇండియాలో చోటు: సురేశ్ రైనా

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. IPLలో 500 పరుగులు చేస్తే ఇండియా టీమ్లో చోటు దక్కే అవకాశముందని అన్నారు. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, జైస్వాల్కు తాను పెద్ద అభిమాని అని చెప్పారు. చాలా మంది ప్లేయర్లు తన టాలెంట్ను ప్రదర్శించి అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటారని పేర్కొన్నారు. మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన రైనా.. టీ20WC, వన్డే WC, CT నెగ్గిన భారత జట్టులో సభ్యుడు.