News June 9, 2024
చెలరేగిన పాక్ బౌలర్లు.. భారత్ 119 ఆలౌట్

T20WCలో పాక్తో మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యారు. పంత్ 42, అక్షర్ పటేల్ 20, రోహిత్ శర్మ 13 మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే వెనుదిరిగారు. కోహ్లీ 4, సూర్య 7, దూబే 3, హార్దిక్ 7, జడేజా 0 నిరాశపర్చారు. నసీమ్ షా, హారిస్ రౌఫ్ చెరో 3 వికెట్లు, అమీర్ 2, షాహీన్ అఫ్రిదీ ఒక వికెట్ తీశారు.
Similar News
News September 13, 2025
బీసీసీఐ అధ్యక్షుడిగా కిరణ్ మోరే?

BCCI తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు ఇందుకు పాజిటివ్గా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఎన్నికలు జరగకపోవచ్చని, ఏకగ్రీవం అయ్యే ఛాన్సుందని ఇటీవల IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా అభిప్రాయపడ్డారు. కిరణ్ మోరే IND తరఫున 49 టెస్టులు, 94 ODIలు ఆడారు. 1988, 1991 ఆసియా కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడిగా ఉన్నారు.
News September 13, 2025
థియేటర్లలో ‘మహావతార్ నర్సింహా’.. @50 డేస్

మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ‘మహావతార్ నర్సింహా’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
News September 13, 2025
త్వరలో జాబ్ కాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

TG: జాబ్ క్యాలెండర్ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.