News October 5, 2024
EXIT POLLS: హరియాణాలో కాంగ్రెస్దే అధికారం: CNN

హరియాణాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 59 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్దే అధికారం అని తేల్చి చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.
Similar News
News November 18, 2025
ఉలిక్కిపడిన రాష్ట్రం

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
News November 18, 2025
ఉలిక్కిపడిన రాష్ట్రం

AP: కొన్నేళ్లుగా మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా హతమవడం, విజయవాడ, కాకినాడలో పెద్ద సంఖ్యలో మావోలను అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెనమలూరులో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకుని 10 రోజులుగా ఉంటున్నా బయటికి పొక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
News November 18, 2025
‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.


