News May 24, 2024
బిగ్బాస్కెట్ గోడౌన్లో డేట్ అయిపోయిన వస్తువులు!

బిగ్బాస్కెట్ గోడౌన్లో చేసిన తనిఖీల్లో డేట్ అయిపోయిన వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. HYD కొండాపూర్లోని మసీదు బండలో గడువు ముగిసిన చికెన్ మసాలా, చికెన్ సాసేజ్లు, పిజ్జా చీజ్, పనీర్, ఐస్క్రీమ్లు, పాలసీసాలు, థిక్ షేక్స్, ఇతర వస్తువులను కనుగొన్నారు. నిర్వాహకులకు నోటీసులిచ్చిన అధికారులు.. తాత్కాలికంగా లైసెన్సును రద్దుచేశారు. వినియోగదారులు ఎక్స్పైరీ డేట్ను చెక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 9, 2025
యానాంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన DGP

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ అధికారి సత్య సుందరం, పరిపాలనాధికారి మునిస్వామి ఎస్పీ రాజశేఖర్లు ట్రాఫిక్పై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. యానాం పురవీధుల్లో ఈ ర్యాలీ సాగింది. యానాంను ప్రీ ట్రాఫిక్ జోన్గా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ షణ్ముగం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
News February 9, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
* బీజేపీకి 48, ఆప్నకు 22, కాంగ్రెస్కు 0 సీట్లు
* ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
* AP: 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా: సీఎం చంద్రబాబు
* విడదల రజినీని దోషిగా నిలబెడతా: ప్రత్తిపాటి
* TG: కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: మంత్రి కొండా సురేఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నాశనం: కేటీఆర్
News February 9, 2025
నిన్న ప్లేయర్.. నేడు కామెంటేటర్

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ SA T20లో మరో అవతారం ఎత్తారు. నిన్నటి వరకు ఆటగాడిగా అలరించిన కార్తీక్ ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచులో కామెంటేటర్గా మారారు. తోటి కామెంటేటర్లతో కలిసి కామెంట్రీ బాక్స్లో ఆయన సందడి చేశారు. కాగా ఈ టోర్నీలో కార్తీక్ పార్ల్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించారు. 7 మ్యాచుల్లో 130 పరుగులు బాదారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి మెంటార్గా వ్యవహరించనున్నారు.