News October 3, 2024

నందిగం సురేశ్ రిమాండ్ పొడగింపు

image

AP: YCP మాజీ MP నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2021లో మంగళగిరిలోని TDP ఆఫీస్‌పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయంతోపాటు వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వీడియోల ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు.

Similar News

News November 21, 2025

పిల్లలకు నెబ్యులైజర్ ఎక్కువగా వాడుతున్నారా?

image

పిల్లల నెబ్యులైజర్‌లో ఉపయోగించే మందులు సాధారణంగా స్టెరాయిడ్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదని సూచిస్తున్నారు. దీన్ని ఎక్కువగా వాడితే వాంతులు, అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. నెబ్యులైజర్ పైపును సరిగ్గా క్లీన్ చెయ్యకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు/ న్యుమోనియా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

News November 21, 2025

వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (1/2)

image

AP: రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ధాన్యాన్ని సులభంగా విక్రయించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సేవలను రైతులు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
☛ ధాన్యం అమ్మాలనుకునే రైతులు 7337359375 నంబరుకు HI అని మెసేజ్ పెట్టాలి.
☛ AI ద్వారా ప్రత్యేక వాయిస్ ఈ సేవలను ఎలా వాడుకోవాలో మీకు తెలుపుతుంది.

News November 21, 2025

వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (2/2)

image

☛ తర్వాత రైతు తన ఆధార్ నంబరు నమోదుచేసి పేరును ధ్రువీకరించాలి.
☛ ధాన్యం అమ్మాలనుకునే తేదీకి 3 ఆప్షన్లు ఇస్తుంది. వాటిలో ఒక తేదీ, సమయం ఎంపిక చేసుకోవాలి.
☛ తర్వాత దాన్యం రకం నమోదు చేసి, ఎన్ని బస్తాలు అమ్ముతారో తెలపాలి. ☛ ఓ మెసేజ్ ద్వారా రైతులకు ధాన్యం అమ్మకం స్లాబ్ బుక్ అయినట్లు కూపన్ కోడ్ వస్తుంది.
☛ ఈ కూపన్ కోడ్ తీసుకెళ్లి రైతు తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు.