News June 12, 2024
దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 12 నెలల కనిష్ఠానికి తగ్గి 4.75శాతంగా నమోదైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.28%, అర్బన్ ఏరియాల్లో 4.15%గా ఉంది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఇన్ఫ్లేషన్ ఏప్రిల్లో 4.83%గా రికార్డ్ అయింది. కొన్ని నెలలుగా ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణమూ మే నెలలో 8.75 నుంచి 8.62%కు చేరి ఊరట కలిగించింది. అయితే 2023 మేలో రికార్డ్ అయిన 3.3% కంటే ఇది ఎక్కువే.
Similar News
News January 7, 2026
₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2026
పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.
News January 7, 2026
తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in


