News June 12, 2024
దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 12 నెలల కనిష్ఠానికి తగ్గి 4.75శాతంగా నమోదైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.28%, అర్బన్ ఏరియాల్లో 4.15%గా ఉంది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఇన్ఫ్లేషన్ ఏప్రిల్లో 4.83%గా రికార్డ్ అయింది. కొన్ని నెలలుగా ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణమూ మే నెలలో 8.75 నుంచి 8.62%కు చేరి ఊరట కలిగించింది. అయితే 2023 మేలో రికార్డ్ అయిన 3.3% కంటే ఇది ఎక్కువే.
Similar News
News March 19, 2025
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. మెరిట్ జాబితాను <
News March 19, 2025
ఏప్రిల్ నుంచి ఎక్స్ట్రా చెల్లించాల్సిందే

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.
News March 19, 2025
పోసాని బెయిల్ పిటిషన్.. 21న తీర్పు

AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ నెల 21కి తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో గుంటూరు జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. సీఐడీ కేసులోనూ బెయిల్ వస్తే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.