News April 28, 2024
టీడీపీలోకి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు

AP: కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో శ్రీను తండ్రి జనిపల్లి తాతారావు, తల్లి సావిత్రి, అన్నయ్య సుబ్బరాజు, చిన్నాన్న వెంకటేశ్వరావు TDP కండువా కప్పుకున్నారు. CM జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనుకి బెయిల్ రాకుండా సీఎం అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఐదేళ్లుగా తమకు కూటమి పార్టీల నేతలు, ప్రజా, దళిత సంఘాలు అండగా నిలిచాయన్నారు.
Similar News
News November 18, 2025
గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.
News November 18, 2025
రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్లైన్లో <
News November 18, 2025
ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్దే అగ్రభాగం.


