News December 1, 2024
రైతులే కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యం: రేవంత్

TG: నెహ్రూ నుంచి నేటివరకు రైతులే కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యమని CM రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉందని, రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్నారు. ‘KCR బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతుబంధును మేం చెల్లించాం. ఆగస్టు 15 నాటికి 22.22 లక్షల మందికి రుణమాఫీ చేశాం. నిన్న కూడా 3.14 లక్షల మంది రైతులకు రూ.2747కోట్ల రుణమాఫీ చేశాం. BRS రుణమాఫీ విషయంలో పదేళ్ల పాటు మోసగించింది’ అని ఆరోపించారు.
Similar News
News February 19, 2025
అలాంటి వారికే పదవులు: మంత్రి లోకేశ్

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.
News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
News February 19, 2025
మస్కిటో కాయిల్ ఎంత పని చేసింది!

AP: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో <<15497063>>అగ్నిప్రమాదం ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగు చూశాయి. మస్కిటో కాయిల్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బెడ్ పక్కనే కాయిల్ పెట్టుకొని విద్యార్థి పడుకోవడంతో ఫ్యాన్ వేగానికి మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో పొగ గది మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 70 మంది విద్యార్థులున్న గదికి ఒకటే ద్వారం ఉండటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.