News January 25, 2025

రైతు భరోసా.. వాళ్లకు గుడ్‌న్యూస్!

image

TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్‌బుక్‌లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్‌‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.

Similar News

News November 23, 2025

డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీకోసం’: జగన్

image

AP: రైతులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని చెప్పి ఎండమావులు చూపిస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతుల ఒంటి మీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారని ఫైరయ్యారు. రైతుల కష్టాలు, బాధలపై చర్చ జరగకుండా చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని విమర్శించారు. 18 నెలల్లో రైతుల కోసం ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అని జగన్ Xలో ప్రశ్నించారు.

News November 23, 2025

అతి పురాతన నక్షత్రాలను నాసా గుర్తించిందా?

image

బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో ఏర్పడిన పురాతన నక్షత్రాలను NASAకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించినట్టు తెలుస్తోంది. భూమికి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో LAP1-B గెలాక్సీలో ఉన్న Population III లేదా POP III అని పిలిచే ఈ స్టార్స్ హైడ్రోజన్, హీలియం తక్కువ ఉండే ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డాయి. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 రెట్లు తీవ్రమైన అల్ట్రావయొలెట్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు.

News November 23, 2025

ఏపీ టెట్.. కొన్ని గంటలే గడువు

image

AP TET దరఖాస్తులకు కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇవాళ 11.59PMలోపు అప్లై చేసుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 2L మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 3న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. DEC 10 నుంచి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. JAN 19న ఫలితాలు వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/