News January 25, 2025

రైతు భరోసా.. వాళ్లకు గుడ్‌న్యూస్!

image

TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్‌బుక్‌లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్‌‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.

Similar News

News February 16, 2025

ప్రముఖ నటి కన్నుమూత

image

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) ఇవాళ కన్నుమూశారు. సియోల్‌లోని తన ఇంట్లో ఆమె శవమై కనిపించారు. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఆమె 2009లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ లైఫ్, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర చిత్రాలు, టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు.

News February 16, 2025

మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్‌ అరెస్ట్

image

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ PM ప్రవింద్ జగన్నాథ్‌(63)ను ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్‌లు, నగదును స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ 2017-24 మధ్య PMగా పనిచేశారు. ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో స్కామ్స్ జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లుగానే చర్యలు తీసుకున్నారు.

News February 16, 2025

పూరీ-గోపీచంద్ కాంబోలో మూవీ?

image

లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త మూవీపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోకస్ చేశారు. ఇటీవలే హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా గోపీచంద్ చివరి 3 చిత్రాలు(రామబాణం, భీమా, విశ్వం) బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయాయి.

error: Content is protected !!