News March 5, 2025
BRS పొరపాటు వల్లే రైతులకు ఇబ్బందులు: మంత్రి ఉత్తమ్

కృష్ణా, గోదావరి జలాల్లో BRS చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ‘ఖరీఫ్లో ఉమ్మడి AP కంటే ఎక్కువ వరి TGలో పండింది. రబీలో 56L ఎకరాల పైగానే సాగు జరుగుతోంది. తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం. APకి BRS ధారాదత్తంగా నీటిని వదిలిపెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చాం’ అని తెలిపారు.
Similar News
News January 4, 2026
ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 4, 2026
ఆరోగ్యానికి బాదం ఇచ్చే 6 అద్భుత ప్రయోజనాలు!

పోషకాల గని అయిన బాదం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తూ బరువు తగ్గడానికి సాయపడతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మం, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని విటమిన్లు, మినరల్స్ ఒంటికి బాగా పడతాయి.
News January 4, 2026
BRS నేతలపై టీడీపీ MLA సోమిరెడ్డి ఆగ్రహం

గోదావరి జలాల్లో AP వాళ్లు ఒక్క బొట్టు వాడుకున్నా సహించేది లేదని BRS నేతలు అన్నారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. BRSకు కౌంటర్గా రేవంత్ కూడా వాడుకోవద్దు అంటున్నారు. ఇది సరికాదు. గోదావరి నీళ్లు రాయలసీమకు ఇస్తామని KCR కూడా గతంలో అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎంలిద్దరూ టీడీపీ వాళ్లే’ అని వ్యాఖ్యానించారు.


