News December 1, 2024
బోనస్తో రైతులు, కౌలు రైతులు సంతోషంగా ఉన్నారు: మంత్రి జూపల్లి

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్తో రైతులు, కౌలు రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ది గొప్ప పాలన అయితే రాష్ట్రం అప్పులపాలు ఎందుకైందని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి అన్నారు. ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన KCR చుక్కనీరు కూడా ఇవ్వలేదని అన్నారు.
Similar News
News February 14, 2025
నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.
News February 14, 2025
RCB: కొత్త కెప్టెన్.. కొత్త ఆశలు.. కొత్త కలలు..

ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు. కొత్త కెప్టెన్ రాకతో ఈసారైనా ఆర్సీబీ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్లుగా కలగా మిగిలిన ట్రోఫీని పాటిదార్ సారథ్యంలో దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాగా RCBకి ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లుగా (ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, వాట్సన్, డుప్లెసిస్) చేశారు. వారిలో ఏ ఒక్కరు ఆ జట్టుకు కప్ను అందించలేకపోయారు.
News February 14, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావుకు బెయిల్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలుత అరెస్టైన ప్రణీత్ రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసీఆర్ హయాంలో ఇతడు SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) డీఎస్పీగా పని చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని, ఆధారాలను ధ్వంసం చేశారని పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.