News December 1, 2024
బోనస్తో రైతులు, కౌలు రైతులు సంతోషంగా ఉన్నారు: మంత్రి జూపల్లి

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్తో రైతులు, కౌలు రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ది గొప్ప పాలన అయితే రాష్ట్రం అప్పులపాలు ఎందుకైందని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి అన్నారు. ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన KCR చుక్కనీరు కూడా ఇవ్వలేదని అన్నారు.
Similar News
News February 8, 2026
మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు: భట్టి

TG: త్వరలో మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 4.50 లక్షల గృహాలు నిర్మించామని చెప్పారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, లేని వారికి జీ+2 తరహాలో నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు.
News February 8, 2026
తలకు నూనె ఎప్పుడు రాయాలంటే?

తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట/ రెండు గంటల ముందు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారానికి రెండుసార్లు నూనె రాస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. రాత్రిళ్లు నూనె రాయకూడదని చెబుతున్నారు.
News February 8, 2026
నేడు ఈ పనులు చేయకండి!

ఈరోజు భాను సప్తమి. ఆదిత్యుడిని పూజించే పవిత్రమైన రోజు! ఇంతటి శుభదినానికి గౌరవమిస్తూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ‘మద్యానికి దూరంగా ఉండాలి. మాంసం ముట్టరాదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి తినరాదు. బ్రహ్మచర్యం పాటించాలి’ అని సూర్యాష్టకంలో ఉంది. లేకపోతే 7 జన్మల పాటు రోగాలు, దరిద్రంతో బాధ పడతారని పండితులు చెబుతున్నారు. శుభ ఫలితాలకై నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


