News December 2, 2024
రైతులను రోడ్డున పడేశారు: YS జగన్

AP: ధాన్యం కొనకుండా రైతులను CM చంద్రబాబు రోడ్డున పడేశారని జగన్ విమర్శించారు. ‘తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. మద్దతు ధర లేక బస్తాకు ₹300-₹400 నష్టానికి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోంది. తుఫాను వస్తుందని 4 రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ధాన్యాన్ని కొనలేదు. రైతులు అవస్థలు పడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్తో CM, మంత్రులు కాలం గడుపుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 13, 2026
నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్లో పతంగుల పండుగ

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.
News January 13, 2026
జనవరి 13: చరిత్రలో ఈరోజు

✯1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
✯1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
✯1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
✯1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
✯1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
✯2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం
News January 13, 2026
ముగ్గురు ఇండియన్లను రిలీజ్ చేసిన అమెరికా!

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్లో ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. ఇవాళ వారిని అధికారులు రిలీజ్ చేశారు. ముగ్గురి క్షేమ సమాచారం కోసం భారత అధికారులు USతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఒత్తిడి నేపథ్యంలో వారిని విడుదల చేశారు. నార్త్ అట్లాంటిక్లో రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్ను ఈనెల 7న US స్వాధీనం చేసుకుంది. అందులోని 28 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.


