News March 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీలు

67 (బాల్స్) – డేవిడ్ మిల్లర్ (SA) vs NZ, లాహోర్, 2025 SF
77 – వీరేంద్ర సెహ్వాగ్ (IND) vs ENG, కొలంబో 2002
77 – జోష్ ఇంగ్లిస్ (AUS) vs ENG, లాహోర్, 2025
80 – శిఖర్ ధవన్ (IND) vs SA, కార్డిఫ్, 2013
87 – తిలకరత్నే దిల్షాన్ (SL) vs SA, సెంచూరియన్, 2009
Similar News
News April 11, 2026
ప్రకాశం: ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News April 11, 2026
భారతీయుల ఇళ్లలో ₹462 లక్షల కోట్ల బంగారం!

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం నిల్వలు టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలను మించిపోయాయని అసోచామ్ వెల్లడించింది. మన ఇళ్లలో ఉన్న పసిడి విలువ సుమారు ₹462.25 లక్షల కోట్లని అంచనా. ఇందులో 2% నిధులు ఆర్థిక వ్యవస్థలోకి చేరినా దేశాభివృద్ధి వేగవంతమవుతుందని నివేదిక పేర్కొంది. 2025 నవంబర్ నాటికి గోల్డ్ లోన్ల విలువ ₹24.34 లక్షల కోట్లకు చేరింది. ఈ సంపదను ఉత్పాదక రంగంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 11, 2026
ఎల్లుండి రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సోమవారం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. అమరావతి ప్రాశస్త్యం, రాజధాని పనుల్లో పురోగతి తదితరాల గురించి తెలిపే బుక్ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అమరావతి బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే.


