News August 15, 2024

‘ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్’ కన్నుమూత

image

DRDO మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్(84) HYDలో కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో పోరాడుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని జైపుర్‌లో జన్మించిన ఆయన 1983లో లాంచ్ అయిన అగ్ని ప్రోగ్రామ్‌లో విశేష సేవలు అందించారు. ‘అగ్ని మిస్సైల్స్‌’కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన్ను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. 1990లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్‌ అవార్డులు అందుకున్నారు.

Similar News

News February 7, 2026

అసలైన హారతి కర్పూరాన్ని గుర్తించడం ఎలా?

image

అసలైన కర్పూరం వెలిగించినప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఎలాంటి బూడిదను, నల్లటి మచ్చలను మిగల్చదు. ఇది స్పటికంలా ఉండి, సులభంగా విరిగిపోతుంది. నిజమైన కర్పూరాన్ని నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతుంది. అదే నకిలీది అయితే నీటిపై తేలుతుంది. స్వచ్ఛమైన కర్పూరం ఘాటుగా ఉండకుండా ప్రశాంతమైన వాసననిస్తుంది. గాలిలో ఉంచితే కొద్దిసేపటికే ఆవిరైపోతుంది. రసాయనాలతో కూడిన నకిలీ కర్పూరం ఆరోగ్యానికి హానికరం.

News February 7, 2026

NHAIలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. అప్లై చేశారా?

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్(సివిల్)అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నెలకు రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nhai.gov.in/

News February 7, 2026

టీమ్ ఇండియా హవా.. రెండేళ్లలో ఐదు ట్రోఫీలు

image

అంతర్జాతీయంగా వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్ ఇండియా హవా కొనసాగుతోంది. గత రెండేళ్లలో టీమ్ ఇండియా ఖాతాలో ఏకంగా 5 ICC ట్రోఫీలు చేరడమే దీనికి నిదర్శనం. 2024లో రోహిత్ సారథ్యంలోని భారత్ T20I వరల్డ్ కప్‌ను గెలుచుకోగా తర్వాతి ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక 2025లోనే U-19 T20WCను మహిళల జట్టు గెలుచుకోగా నవంబర్‌లో హర్మన్ సేన వన్డే వరల్డ్ కప్ నెగ్గింది. తాజాగా U-19 మెన్స్ టీమ్ వన్డే WC గెలుచుకుంది.