News February 22, 2025
తండ్రీకొడుకుల సాహసం.. బైక్పై కుంభమేళా యాత్ర

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఎలాగైనా వెళ్లాలనే తపన ఆ తండ్రీకొడుకులను 3900 KM బైక్పై వెళ్లేలా చేసింది. కర్ణాటక ఉడిపిలోని శిర్వకు చెందిన ప్రజ్వల్ తన తండ్రి రాజేంద్ర(52) కోరికను తీర్చేందుకు బైక్పై రోజుకు 500KM చొప్పున 4 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్కు తీసుకెళ్లాడు. పవిత్ర స్నానం తర్వాత FEB 10న బయల్దేరి 13న శిర్వకు వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ రూ.20000తో టూర్ ముగించారు.
Similar News
News December 10, 2025
U19 హెడ్ కోచ్పై క్రికెటర్ల దాడి.. CAPలో కలకలం

పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్(CAP)లో కోచ్పై దాడి జరగడం కలకలం రేపింది. U19 హెడ్ కోచ్ వెంకటరామన్పై ముగ్గురు లోకల్ క్రికెటర్లు బ్యాటుతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమై 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతోనే ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోకల్ ప్లేయర్లను కాదని ఫేక్ డాక్యుమెంట్లతో నాన్ లోకల్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నారని CAPపై ఆరోపణలున్నాయి.
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.


