News February 1, 2025
బీమా రంగంలో FDI 100 శాతానికి పెంపు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిధిని ప్రస్తుతమున్న 74శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. FDI విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సమీక్షించి మరింత సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, మొత్తం ప్రీమియాన్ని భారత్లోనే ఇన్వెస్ట్ చేసే బీమాదారులకు ఇది వర్తించనుంది. దీని ద్వారా బీమా రంగం మరింత బలోపేతమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు వివరిస్తున్నారు.
Similar News
News February 7, 2025
ట్రైన్లో ప్రసవం.. పండంటి ఆడబిడ్డ జననం!

బిహార్లోని సమస్తిపూర్కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ట్రైన్ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News February 7, 2025
అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.
News February 7, 2025
KTRకు అంతర్జాతీయ ఆహ్వానం

TG: మాజీ మంత్రి KTRకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. IBC-2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. పదేళ్ల BRS పాలనలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అద్భుతమని ప్రశంసించింది. HYDను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని, తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని అభినందించింది.