News August 11, 2025

వీడిన భయాలు.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

ట్రంప్ టారిఫ్స్ భయాల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 746 పాయింట్లు లాభపడి మళ్లీ 80,604, నిఫ్టీ 221 పాయింట్లు వృద్ధి చెంది 24,585 వద్ద క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్, ఎటర్నల్, ట్రెంట్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, అదానీ పోర్ట్స్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. బెల్, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Similar News

News April 20, 2026

డెంగీ తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

image

దేశంలోని తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యూడెంగా (TAK-003) వ్యాక్సిన్‌ను టకేడా ఫార్మాసూటికల్ కంపెనీ (జపాన్) అభివృద్ధి చేసింది. 4-60ఏళ్ల మధ్య వారు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రావొచ్చు. HYDకు చెందిన బయో-ఈ సంస్థతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

News April 20, 2026

8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.